ముగించు

విపత్తు నిర్వహణ

డిసెంబర్ 2005 లో,భారత ప్రభుత్వం విపత్తు నిర్వహణ చట్టం,2005 ను అమలు చేసింది.ఈ చట్టం విపత్తుల సమర్దవంతమైన నిర్వహణకు చట్టపరమైన మరియు సంస్థాగత చట్రాన్ని అందిస్తుంది.దాని నిబంధనల ప్రకారం,ప్రధాన మంత్రి నేతృత్వంలోని జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ(ఎన్‌డి‌ఎం‌ఎ),ముఖ్యమంత్రుల నేతృత్వంలో రాష్ట్ర విపత్తు నిర్వహణ     అధికారులు(ఎన్‌డి‌ఎం‌ఎ),మరియు  కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా విపత్తు నిర్వహణ అధికారులు(డి‌డి‌ఎం‌ఎ) స్టాపించారు.అంతేకాకుండా,ఈ చట్టం జాతీయ,రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలో విపత్తు నిర్వహణ ప్రణాళికలతో పాటు జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి మరియు జాతీయ విపత్తు తగ్గించే నిధిని కూడా అందిస్తుంది.

రాజన్న సిరిసిల్ల జిల్లా స్థాయిలో,జిల్లా స్థాయిలో విపత్తు నిర్వహణ మొత్తం సమన్వయం మరియు అమలు బాద్యత జిల్లా కలెక్టర్ పై ఉంది.కలెక్టర్ జిల్లా కోసం జిల్లా విపత్తు నిర్వహణ ప్రణాళికను సిద్ధం చేస్తాడు మరియు ఎస్‌డి‌ఎం‌ఎ నిర్దేశించిన నివారణ,తగ్గించడం,సంసిద్ధత మరియు ప్రతిస్పందన చర్యల మార్గదర్శకాలను జిల్లాలోని అన్నీ లైన్ విభాగాలు స్టానిక అధికారులు అనుసరిస్తారని పర్యవేక్షిస్తుంది మరియు నిర్దారిస్తుంది.వ్యక్తిగత లైన్ విభాగాలు(ఉదా.,పంచాయితీ రాజ్ విభాగం,వ్యవసాయ విభాగం,ఇరిగేషన్&సి‌ఎడి;ఫైర్ సర్వీసెస్,లోకల్ బాడీస్,పవర్ డిస్కోమ్;మెడికల్,పౌరసరఫరాల శాఖ)వారి అధికార పరిధిలోని విపత్తు సంసిద్ధతకు సంబంధించిన నిర్దిష్ట బాధ్యతలను నిర్వర్తిస్తాయి.

జాతీయ విపత్తుల హెల్ప్ లైన్ నెంబర్:1078