ముగించు

చరిత్ర

రాజన్న సిరిసిల్ల పూర్వ కరీంనగర్ జిల్లా నుండి  11 అక్టోబర్ 2016  న ఆవిర్బవించింది .దీని చుట్టూ  కరీంనగర్,కామారెడ్డి మరియు సిద్దిపేట జిల్లాలు ఉన్నాయి.గోదావరి నదికి  ఉపనది అయిన మానేరు నది జిల్లా గుండా వెళుతూ నీటిపారుదల మరియు తాగునీటి సరఫరా ప్రయోజనాలను అందిస్తుంది.పురాతన మరియు ప్రసిద్ధ శైవ దేవాలయాలలో ఒకటి అయిన శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయం వేములవాడ పట్టణంలో ఉంది.ఈ మందిరం “దక్షిణ కాశి” గా ప్రసిద్ది చెందింది.భక్తులు ఈ ఆలయానికి అధిక సంఖ్యలో వస్తారు.ఆలయ ఆవరణలో ఉన్న ధర్గ సహనానికి నిదర్శనం.వేములవాడ ఆలయంలో మరియు చుట్టుపక్కల వున్న రాక్ కట్ శాసనాలు ఈ ప్రదేశం యొక్క చారిత్రక ప్రాముఖ్యతను తెలుపుతాయి.ఇది క్రీ.శ 750 నుండి క్రీ.శ 973 వరకు పాలించిన వేములవాడ చాళుక్యుల రాజధాని.సంప్రదాయ ఈ ప్రదేశంతో ప్రసిద్ద తెలుగు కవి “భీమకవి” తో అనుబంధం ఉంది,అయితే ప్రసిద్ధ కన్నడ కవి “పంప” ఇక్కడ అరికేసరి-2 యొక్క ఆస్థాన కవిగా నివసించారని మరియు అతని “కన్నడ భరత” ను తన రాజ ప్రాపకం కోసం అంకితం చేశారని మరింత ఖచ్చితమైన రుజువు ఉంది.వేములవాడ సమీపంలో నాంపల్లి గుట్ట ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం అనేక పర్యటకులను మరియు భక్తులను ఆకర్షించే మరొక ప్రసిద్ద పవిత్ర ఆలయం.రాజన్న సిరిసిల్ల మరియు వేములవాడ  కు రవాణా వ్యవస్థ పరంగా రోడ్డు మార్గం అనుసంధానించబడి ఉంది.